బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలి
జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్‌‌‌‌

ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ లాగా బీసీలకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసం చేస్తామంటే ఊరుకోబోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీసీలకు టికెట్లు ఇవ్వని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వకపోతే, ఆయా పార్టీలు బీసీలను ఓట్లు అడిగే హక్కును కోల్పోతాయన్నారు.

‘బీసీల ఓటు బీసీలకే’ అనే నినాదంతో దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో బీసీల అలయ్ బలయ్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం దోమలగూడలోని బీసీ భవన్‌‌‌‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో జాజుల హాజరై, మాట్లాడారు. బీసీలకు 60 టికెట్లు, సీఎం పదవి ఇస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, లేదంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లోపల బయట బీసీల తరఫున మాట్లాడుతుంటే.. రేవంత్ మాత్రం రాష్ట్రంలో రెడ్డిలకు పెద్దపీట వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.