పల్లా రాజేశ్వర్రెడ్డికి జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

పల్లా రాజేశ్వర్రెడ్డికి జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

పల్లా రాజేశ్వర్రెడ్డి కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జనగామ నియోజవర్గాన్ని అభివృద్ధి చేశాం.. జనగామ ప్రజలకు పల్లా ఏం చేశాడని ముత్తిరెడ్డి ప్రశ్నించారు. నా నియోజకవర్గ ప్రజలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి పైసలు పంచుడేందని ముత్తిరెడ్డి అన్నారు. తన బిడ్డ, అల్లుడిని కావాలనే పల్లా రాజేశ్వర్ రెడ్డి రెచ్చగొట్టి కుటుంబంలో చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి పద్దతి మార్చు కోవాలని హెచ్చరించారు. 

సీఎం కేసీఆర్ అప్పుడే టికెట్లు కేటాయించారు.. జనగామ టికెట్ తనకే ఇచ్చారని పల్లా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. తన అనుచరులకే ఫోన్ చేసి సపోర్టు చేయాలని అడగడం ఏందని అన్నారు. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను.. అప్పటి నుంచి జనగామ ప్రజలకు నేను ఎంతో చేశాను. ప్రజలు కూడా నాతోపాటే ఉన్నారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గంపై కన్నేశారని ఎలాగైనా.. టికెట్ తనకే కేటాయించారని కార్యకర్తలను అయోమయానికి  గురిచేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. ఇకనైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మాను కోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హెచ్చరించారు.