దివంగత నటి శ్రీదేవికి నివాళిగా ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్లో శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోని కపూర్, ఆమె కూతుళ్ళు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ హాజరయ్యారు. మిస్టర్ ఇండియా చిత్రంలోని హవా.. హవాయి సాంగ్లో శ్రీదేవి లుక్ మాదిరిగానే మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. తన తల్లి మైనపు విగ్రహాన్ని చూస్తూ అలా ఉండిపోయింది జాన్వీ.