జేడీ లక్ష్మీనారాయణ కొత్త స్టైల్..బాండ్ పేపర్ పై హామీలు

జేడీ లక్ష్మీనారాయణ కొత్త స్టైల్..బాండ్ పేపర్ పై హామీలు

విశాఖపట్నం:  రాజకీయాల్లో కొత్త స్టైల్ కు తెరలేపారు సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ . ఎన్నికల హామీలను బాండ్ పేపర్ పై రాసి రిలీజ్ చేశారు. జనసేన మేనిఫేస్టో కాకుండా తాను పోటీ చేస్తున్న విశాఖకు సపరేట్ మేనిఫేస్టోను రిలీజ్ చేశారు. గెలిచాక విశాఖకు ఏం చేస్తారో ఆ హామీలను  100 రూపాయల బాండ్ పేపర్ పై రాసి సైన్ చేసి రిలీజ్ చేశారు.  ఇచ్చిన హామీలు అమలు చేయ్యకపోతే కోర్టుకు కూడా లాగొచ్చని తెలిపారు. విశాఖలోని అగ్రిగోల్డ్ బాధితుకు న్యాయం చేస్తానని చెప్పారు.  మూడు నెలలకు ఒకసారి ఇచ్చిన హామీలను.. సమస్యల పరిష్కారానికి చేసిన పురోగతిపై నివేదిక..’Reach your MP’ పేరిట యాప్‌ని రిలీజ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతానని చెప్పారు.

ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంట‌లో తనవంతు కృషి చేస్తానని, విశాఖ సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. విశాఖలోనే ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఒక ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తానని మేనిఫేస్టోలో తెలిపారు. ఇవి కాకుండా పలు ఇతర హామీలను మేనిఫేస్టోలో పొందుపరిచారు.