నా బిడ్డ చనిపోయినంక దెవులాడిండ్రు:చిన్నారి తల్లిదండ్రులు

 నా బిడ్డ చనిపోయినంక దెవులాడిండ్రు:చిన్నారి తల్లిదండ్రులు

పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని జవహార్ నగర్ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. పాపను తమకు చూపించకుండానే ఆస్పత్రికి తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు.  నిన్న ఉదయం 9గంటలకు పాపను స్కూల్ దగ్గర దింపినట్లు తండ్రి తెలిపారు. 9.20కు పాప షాప్ వెళ్లినట్లు తన ఫ్రెండ్స్ చెప్పారని.. ఆ తర్వాత నుంచి కన్పించలేదని చెప్పారు.

పోలీసులు సరిగ్గా రెస్పాండ్ కాలేదు

పాప కన్పిస్తలేదని 10.30కు స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని.. వెంటనే వెళ్లి వెతికినట్లు తండ్రి చెప్పారు. పాప నవ్వుకుంటూ స్కూల్కు వెళ్లిందని తల్లి చెప్పింది. చెరువు వైపు ఎందుకు వెళ్లిందో తెలియదని తెలిపింది. పోలీసులు సరిగ్గా రెస్పాండ్ కాలేదని చెప్పారు. 

గంజాయి తాగేవారికి జవహార్ నగర్ అడ్డాగా మారిందని పాప బంధువు ఆరోపించారు. పాప చనిపోయిన చెరువు దగ్గర నలుగురు వ్యక్తులు గంజాయి మత్తులో సంచరించినట్లు తెలిపారు.  పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.