అట్లీ, షారుఖ్, విజయ్ కాంబో.. టార్గెట్ రూ.3 వేల కోట్లు!

అట్లీ, షారుఖ్, విజయ్ కాంబో..  టార్గెట్ రూ.3 వేల కోట్లు!

జవాన్(Jawan) సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు హీరో షారుఖ్ ఖాన్(Shah rukh khan), దర్శకుడు అట్లీ(Atlee). పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించింది. ఈ సినిమా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 

దీంతో దర్శకుడు అట్లీతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు తన తరువాతి సినిమా కోసం ఓ క్రేజీ కాంబోను సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడట. ఆ స్టార్స్ కాంబో మరెవరో కాదు తలపతి విజయ్(Thalapathy Vijay), కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan). ఈ ఇద్దరు హీరోలంటే దర్శకుడు అట్లీలు చాలా అభిమానం. ఇప్పటికే విజయ్ తో వరుసగా తెరీ,మేర్సల్,బిజిల్ వంటి మూడు బ్లాక్ బస్టర్స్ చేశాడు అట్లీ. ఇప్పుడు షారుఖ్ తో జవాన్ చేసి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక తాజాగా ఈ ఇద్దరి హీరోలతో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చేయాలని ప్లాన్ చేస్తన్నాడట. రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ ఈ ఇద్దరితో సినిమా చేయాలని ఉందని, ఆ సినిమాతో రూ.3000 కోట్లు వసూళ్లు రాబట్టాలనేదే తన కల అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అట్లీ మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కాంబో గనక సెట్ అయితే.. రూ.3000 కోట్లు ఈజీగా వస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అట్లీ ఈ సినిమా ఎప్పుడు మొదలుపెట్టనున్నాడు అనేది త్వరలోనే తెలియనుంది.