తెలంగాణ ఉద్యమాలకు కేంద్ర బిందువు ​జయశంకర్​

తెలంగాణ ఉద్యమాలకు కేంద్ర బిందువు ​జయశంకర్​
  •     ప్రముఖ కవి నగ్నముని 

ముషీరాబాద్, వెలుగు : ప్రపంచస్థాయి అద్భుత పోరాటాలతోనే తెలంగాణ సాధించామని,  అట్లాంటి ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ప్రొఫెసర్ జయశంకర్ నిలిచారని ప్రముఖ కవి నగ్నముని కొనియాడారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జయశంకర్ స్ఫూర్తి పురస్కార సభ జరిగింది. చీఫ్​గెస్ట్​గా  కవి నగ్నముని, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్​ రావు హాజరై జయశంకర్ స్ఫూర్తి పురస్కారాన్ని ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతకు ప్రదానం చేశారు.

అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు కుటుంబాల జాబితాను ప్రభుత్వం ఇప్పటికీ తయారు చేయకపోవడం విచారకరమని వక్తలు ఆవేదన వ్యక్తంచేశారు.  కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక అధ్యక్ష కార్యదర్శులు కొండి మల్లారెడ్డి, బూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.