
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ –2025 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం10గంటలకు ఐఐటీ కాన్పూర్ మార్కులు, ర్యాంకులను రిలీజ్ చేయనున్నది. జేఈఈ రెండు సెషన్లలో మే 18న జరిగింది. హైదరాబాద్ సహా 13 ఏరియాల్లో పరీక్షలు నిర్వహించగా, దానికి సుమారు 20వేల మంది అటెండ్ అయ్యారు. అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inలో లాగిన్ అయి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ మార్కులు కూడా ప్రకటించనున్నారు. అయితే, ఈ నెల 3 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. దీనిద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ సారి ఆరు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేశారు.