మిషిగన్ సరస్సు అడుగున ఏసు

మిషిగన్ సరస్సు అడుగున ఏసు

అమెరికాలోని నార్త్ మిషిగన్‌ లో ఉన్న చిన్న పట్టణం పిటోస్కీకి వందలాది మంది ప్రజలు వెళ్తున్నారు. అక్కడ సరస్సులో అత్యంత అరుదైన అద్భుతాన్ని చూసేందు కు క్యూ కడుతున్నారు. ఏంటా అద్భుతం? అంటే మిషిగన్‌ సరస్సులో జీసెస్‌శిలువ విగ్రహం ఉంది మరి. ఆ అరుదైన విగ్రహాన్నిచూసేందు కు గడ్డకట్టే చలిలోనూ గంటల కొద్దీ వేచి చూస్తున్నారు. మిషిగన్‌ సరస్సు గడ్డకట్టిపోయినా లోపలికి వెళ్లి విగ్రహాన్ని చూసేందు కు వీలుగా పైనున్న మంచును తవ్వారు. శనివారం నుంచి ఇప్పటివరకు సుమారు 1,200 మంది యాత్రికులు విగ్రహాన్ని చూడగలిగారు. అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించక నాలుగేళ్లుగా సందర్శనను నిలిపేశారు. తాజాగా శనివారం నుం చి మళ్లీ సందర్శకులు క్యూ కడుతున్నారు. ప్రపంచంలో మంచి నీటిలో ఉన్న ఏసు విగ్రహం ఇదేనని అంటున్నారు. లిటిల్‌ ట్రావర్స్‌‌ బే నుంచి 365 మీటర్ల దూరంలో ఉన్న ఈ విగ్రహం సుమారు 46 మీటర్ల లోతులో ఉంది.

మేడ్‌ ఇన్‌ ఇటలీ….

ఇంతకీ ఆ విగ్రహం అక్కడి ఎలా వెళ్లిం ది? దాన్ని ఎవరు చేశారు? అంటే ‘ఇన్‌ సైట్‌ ఎడిషన్‌ ’ ప్రకారం ఇటలీలో 1956లో ఆ విగ్రహాన్ని తయారు చేశారు. మిషిగన్‌ లోని బ్యాడ్‌ ఎక్స్ లో ప్రమాదవశాత్తు చనిపోయిన 15 ఏళ్ల యువకుడికి గుర్తుగా ఓ కుటుం బం దాన్ని తయారు చేయించింది. కానీ ఆ విగ్రహం విరిగిపోయిందని, మరొకటి కావాలని అప్పట్లో ఆ కుటుంబం డిమాండ్‌ చేసింది. దీంతో ఆ విగ్రహాన్ని ఓ స్థానిక డైవింగ్‌ క్లబ్‌ మెంబర్‌‌ కొన్నాడు. మిషిగన్‌ లోని టార్చ్‌ సరస్సులో మునిగి చనిపోయిన ఓ డైవర్‌‌కు గుర్తుగా దాన్ని సరస్సు అడుగున పెట్టాడు. అప్పటి నుంచి ఆ విగ్రహం నీటిలో మునిగిన వారికి జ్ఞాపకంగా మారింది. 1986 నుంచి సందర్శకులు విగ్రహాన్ని చూసేకుందుకు రావడం మొదలైంది. కానీ సరస్సు వాతావరణ పరిస్థితుల వల్ల 2015లో సందర్శన నిలిపేశారు.