సెల్ఫ్ ఐసోలేషన్ లోకి జార్ఖండ్ సీఎం

సెల్ఫ్ ఐసోలేషన్ లోకి జార్ఖండ్ సీఎం

తన మంత్రిమండలిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకున్నారు. తన కేబినెట్ మంత్రి మిథిలేష్ ఠాకూర్ జీ మరియు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మధుర మహాటో జీ ఇద్దరికి కరోనా సోకడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం వారిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా.. నేను కూడా కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉంటాను. అయితే ఇంట్లోంచే నా విధులను నేను నిర్వర్తిస్తాను’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

బుధవారం నాటికి జార్ఖండ్ లో 3056 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 2104 కేసులు రికవరీ కాగా.. 930 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు జార్ఖండ్ లో కరోనా వల్ల 22 మంది చనిపోయారు.