OTTకి వచ్చేస్తున్న జిగర్ తండ డబుల్ ఎక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTTకి వచ్చేస్తున్న జిగర్ తండ డబుల్ ఎక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence), మరో దర్శకుడు ఎస్ జే సూర్య(SJ Surya) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ  జిగర్ తండ డబుల్ ఎక్స్(jigarthanda doublex). తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు(Karthik subbaraju) తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2014లో వచ్చిన సూపర్ హిట్ మూవీ జిగర్ తండ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఫుల్లుగా ఆకట్టుకుంది. టీజర్,ట్రైలర్ తో రిలీజ్ కు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. 

దీంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. కేవలం పదిరోజుల్లోనే రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిగర్ తండ డబుల్ ఎక్స్ రిలీజై దాదాపు 15 రోజులు కావస్తోంది. ఆల్రెడీ కొత్త సినిమాలు రిలీజ్ అవడంతో ఈ మూవీ సందడి కూడా తగ్గింది. దీంతో  జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమాను ఓటీటీ రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారట మేకర్స్. ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. మరి థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.