రిలయన్స్ జియో కస్టమర్ల కు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆ సంస్థ రెండు కొత్త ప్రీపెయిడ్ డేటా ప్యాక్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవే రూ. 19, రూ. 29 ప్లాన్లు. 1 జీబీ లేదా 2 జీబీ కంటే కొంచెం ఎక్కువ డేటాను కోరుకునే వారు ఈ ప్లాన్ లను రిఛార్జి చేసుకోవచ్చు. వాటి వివరాలు...
రూ. 19 ప్రీపెయిడ్ ప్యాక్
రిలయన్స్ జియో రూ.19 డేటా ప్యాక్ను 1.5 జీబీ డేటాతో అందిస్తోంది. దీని కాల వ్యవధి ప్రస్తుత ప్రీపెయిడ్ ప్యాక్ లాగే ఉంటుంది. 1జీబీ డేటాను అందించే రూ.15 ప్యాక్ నుంచి తాజా ప్యాక్తో జియో మరో మెట్టు ఎక్కినట్టైంది. సో.. మీకు అదనంగా 500ఎంబీ డేటా కావాలంటే, రూ. 4 అదనంగా చెల్లించాలి.
రూ. 29 ప్రీపెయిడ్ ప్లాన్
రూ.29 ప్రీపెయిడ్ ప్లాన్ తో 2.5 జీబీ డేటాను జియో అందిస్తోంది. ఈ ప్లాన్ కూడా వినియోగదారుల యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్కు సమానంగా ఉంటుంది. ఇప్పటికే ఉన్న రూ. 25 డేటా బూస్టర్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవడానికి ఇష్టపడే వినియోగదారులకు ఈ ప్లాన్ డికాయ్ ఎఫెక్ట్గా కూడా ఉపయోగపడుతుంది. జియో నుండి రూ.25 ప్లాన్ 2జీబీ డేటాతో వస్తోంది. తాజా నిర్ణయంతో 2జీబీ కి బదులుగా, వినియోగదారులు అదనంగా రూ. 4 చెల్లించి 2.5 జీబీ ని పొందవచ్చు. తాజా ప్లాన్లను ఒక సారి చెక్ చేసేయండి మరి.