సైన్స్​ పునాదిగా ఉంటేనే టెక్నాలజీ డెవలప్​మెంట్ సాధ్యమవుతుంది:కట్టా నర్సింహారెడ్డి

సైన్స్​ పునాదిగా ఉంటేనే టెక్నాలజీ డెవలప్​మెంట్ సాధ్యమవుతుంది:కట్టా నర్సింహారెడ్డి

కూకట్​పల్లి, వెలుగు: సైన్స్​ పునాదిగా ఉంటేనే టెక్నాలజీ డెవలప్​మెంట్ సాధ్యమవుతుందని జేఎన్టీ​టీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్​ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. సమాజాభివృద్ధికి సైన్స్ ఎంతో అవసరమనే అంశాన్ని టెక్నికల్ స్టూడెంట్లు గుర్తించాలన్నారు. ‘రసాయన శాస్త్రం ప్రాధాన్యత’ అంశంపై జేఎన్టీయూ ఆడిటోరియంలో మూడ్రోజుల పాటు జరగనున్న ఇంటర్నేషనల్​ సెమినార్​ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ..  కొంతకాలంగా స్టూడెంట్లు ఇంజినీరింగ్​పై దృష్టిపెడుతూ  సైన్స్ ను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది  ఏమాత్రం మంచిది కాదన్నారు.

సైన్స్​ ప్రాధాన్యతను గుర్తించి, అందుకు అనుగుణంగా చదువును కొనసాగించాలని సూచించారు. చీఫ్​గెస్టుగా హాజరైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(సీఎస్ఐర్) డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మనిషి జీవితం రసాయన శాస్త్రంతో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ప్రిన్సిపల్ జయలక్ష్మి, సెమినార్​కన్వీనర్ ​ప్రొఫెసర్​రమాదేవి తదితరులు పాల్గొన్నారు.