JNTUH ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా

JNTUH ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా

హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ తరగతుల పై కూకట్ పల్లి JNTUH కీలక ప్రకటన చేసింది. ఈనెల 17 నుండి 22 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ నెల17 నుండి 22 వరకు అన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.