JNU ఘటన: 26/11 ముంబై ఉగ్ర దాడులు గుర్తుకొచ్చాయ్

JNU ఘటన: 26/11 ముంబై ఉగ్ర దాడులు గుర్తుకొచ్చాయ్

JNU ఘటనలు టీవీలో చూస్తున్నప్పుడు తనకు 26/11 ముంబయి ఉగ్ర దాడులు గుర్తుకొచ్చాయన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.  యూనివర్శిటిలో దాడులు చేసినవారు మాస్కులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ముసుగులు ధరించి పిరికిపందల్లా దాడికి పాల్పడ్డ ఆ దుండగులెవరో బయటపడాలన్నారు. ఒకవేళ దాడి చేసిన నేరస్థులను గుర్తించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమైతే.. వారు కూడా నేరంలో భాగస్వాములై   ఉంటారని సీఎం అన్నారు.

దేశంలోని విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారని, కానీ మహారాష్ట్రలో మాత్రం విద్యార్ధులు సేఫ్ గానే ఉన్నారన్నారు. JNU  తరహా ఘటనలు తన రాష్ట్రంలో జరగనివ్వనని ఉద్ధవ్ అన్నారు.

Related News: JNU సంఘటన ఖచ్చితంగా కుట్రే : కపిల్ సిబల్