పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు పొత్తూరు వెంకటేశ్వరరావు. పత్రికారంగంలో ఐదు దశాబద్దాలకు పైగా సేవలు అందించారు. ఈనాడు, ఆంధ్రభూమి, వార్త పత్రికల్లో పని చేశారు. ఉమ్మడి ఏపీలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేశారు.

పొత్తూరి వెంకటేశ్వర రావు మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరువరానిదని కొనియాడారు. పత్రికా రంగంలో 5 దశాబ్ధాలకు పైగా సేవలందించిన పొత్తూరి వెంకటేశ్వర రావు తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శంగా నిల్చారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా పని చేసిన పొత్తూరి ఎందరో పాత్రికేయులను తీర్చిదిద్దారని అన్నారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు