యూరప్ దేశాలకు మరింత ఈజీ కానున్నజర్నీ

యూరప్ దేశాలకు మరింత ఈజీ కానున్నజర్నీ
  • జనవరిలో ప్రారంభించనున్న లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్

శంషాబాద్, వెలుగు : శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి యూరప్ దేశాలకు జర్నీ మరింత ఈజీ కానుంది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ వచ్చే ఏడాది జనవరి 16న.. శంషాబాద్  నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్టుకు తొలి డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్  ప్రారంభించనుంది. దీనిలో 26 బిజినెస్ క్లాస్, 21 ప్రీమియం ఎకానమీ, 247 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. ప్రారంభ విమానం ఫ్రాంక్‌‌ ఫర్ట్ నుంచి ఉదయం 10కి బయలుదేరి, రాత్రి 11 గంటలకు హైదరాబాద్ కు  చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి  అర్ధరాత్రి ఒంటిగంటకు బయలుదేరి ఉదయం 6:10కి ఫ్రాంక్‌‌ఫర్ట్ లో ల్యాండ్ అవుతుంది. ఫ్రాంక్‌‌ఫర్ట్, -శంషాబాద్ విమానాశ్రయాల మధ్య మంగళ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తుంది. సోమ, బుధ, శనివారాల్లో హైదరాబాద్‌‌ నుంచి విమానం బయలుదేరుతుంది. ఈ రూట్ తెలంగాణ, సమీప ప్రాంతాల ప్రయాణికులను యూరప్‌‌లోని అనేక నగరాలు, దేశాలతో కనెక్ట్ చేయనుంది.