ఎన్టీఆర్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నజపాన్ ఫ్యాన్స్

ఎన్టీఆర్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నజపాన్ ఫ్యాన్స్

బాక్సాపీస్ ను షేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ జపాన్ లో అక్టోబర్ 21న గ్రాండ్ గా స్ధానిక భాషలో విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహించడం కోసం రాంచరణ్, ఎన్టీఆర్ దంపతులు జపాన్ కు వెళ్లారు. వీరితో పాటు దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు. తమ అభిమాన హీరోలను చూడడం కోసం జపాన్ యువతీ యువకులు పోటీ పడుతున్నారు. ఆటోగ్రాఫ్, సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. వారిని హీరోలు అప్యాయంగా పలకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్  ఫ్యామిలీ బస చేసిన హోటల్ వద్దకు లేడీ ఫ్యాన్స్ తరలి వచ్చారు. వారిని చూసిన ఎన్టీఆర్ సంప్రదాయ పద్ధతిలో నమస్కరించారు.

హీరో ఎదురుగా నిలబడడం.. మాట్లాడడంతో కొంతమంది మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. ఎమోషనల్ కు గురవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించించిన ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు వెర్షన్ ని జపనీస్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. శుక్రవారం భారీ స్థాయిలో సినిమా విడుదలైంది.