మరోసారి రికార్డు సృష్టించిన జీఎస్టీ వసూళ్లు

మరోసారి రికార్డు సృష్టించిన జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. 2022, జులై నెలలో అత్యధికంగా లక్షా 48వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.  ఇది జీవితకాల రెండో గరిష్ఠమని కూడా వెల్లడించింది. గతేడాది జులైలో వసూలైన జీఎస్టీ ట్యాక్స్​ కన్నా ఈ సారి 28% శాతం అధికంగా రాబడి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో  సీజీఎస్టీ 25వేల 751 కోట్లు, ఎస్ జీఎస్టీ 32వేల 807 కోట్లు, ఐజీఎస్టీ  79వేల 518 కోట్లు, సెస్ రూపంలో 10వేల 920 కోట్లు వసూలయ్యాయని తెలిపింది.

గతేడాది జులై నెలతో పోల్చితే ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లలో 28శాతం వృద్ధి నమోదైందని ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. జులై నెలలో తెలంగాణ నుంచి 4వేల 547 కోట్ల జీఎస్టీ వసూలు కాగా... గతేడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఇదే అధికమని తెలిపింది. జులై 2021లో వస్తు, సేవల పన్ను వసూళ్లు రూ. 1,16,393 కోట్లుగా ఉన్నాయి. అయితే  జులై 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన నుంచి చూసుకుంటే ఈ ఏడాది జులైలో నమోదైన వసూళ్లు రెండో అత్యధికమైన వసూళ్లుగా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.