జీతం ఇవ్వని ప్రభుత్వం.. జూనియర్ అసిస్టెంట్​ ఆత్మహత్య

జీతం ఇవ్వని ప్రభుత్వం.. జూనియర్ అసిస్టెంట్​ ఆత్మహత్య
  • వీఆర్ఏ రెగ్యులరైజేషన్ ద్వారా పోస్టింగ్ పొందిన సతీశ్​      
  • 2  నెలలుగా అందని జీతం

హనుమకొండ, ఆత్మకూరు, వెలుగు : వీఆర్ఏ రెగ్యులరైజేషన్​లో భాగంగా జూనియర్​ అసిస్టెంట్​గా పోస్టింగ్​ పొందిన ఓ యువకుడు జీతం రాక కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. తోటి ఉద్యోగులు, గ్రామస్తుల కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా దామెర మండలం వెంకటాపూర్ ​గ్రామానికి చెందిన ఇజ్జగిరి సతీశ్ ​(36) వీఆర్ఏగా పని చేసేవాడు.  రెండు నెలల కింద ప్రభుత్వం వీఆర్​ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. సతీశ్​కు దామెర తహసీల్దార్ ​ఆఫీస్​లో జూనియర్​ అసిస్టెంట్​గా పోస్టింగ్ ​ఇచ్చింది.

అప్పటి నుంచి  జీతం రాకపోవడంతో సతీశ్ ​ఇబ్బందులు పడుతున్నాడు. కుటుంబపోషణ భారమై, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా ఇదే విషయమై బుధవారం రాత్రి తల్లిదండ్రులు, భార్యతో  గొడవ జరిగింది.  మనస్తాపానికి గురైన సతీశ్ అర్ధరాత్రి ఉరేసుకుని సూసైడ్​ చేసుకున్నాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ రాజేందర్ తెలిపారు.