రాత్రి రిజిస్టేషన్లు చేసిన జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

రాత్రి రిజిస్టేషన్లు చేసిన జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

లాక్ డైన్ రూల్స్ బ్రేక్ చేసి రిజిస్ట్రేష‌న్..జూనియ‌ర్ అసిస్టెంట్ స‌స్పెండ్
మంచిర్యాల జిల్లా: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప‌ని చేసిన జూనియ‌ర్ అసిస్టెంట్ ను స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలిపింది రిజిస్ట్రేష‌న్ల శాఖ‌. మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ర‌తన్ అనే వ్య‌క్తి జూనియ‌ర్ అసిస్టెంట్ గా ప‌ని చేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కార‌ణంగా రిజిస్ట్రేష‌న్ల ఆఫీసులు మూసివేసిన విష‌యం తెలిసిందే.

అయినా కూడా అధికార పార్టీకి చెందిన రియ‌ల్ట‌ర్ల అక్ర‌మ ప్లాట్ల‌కు రిజిస్ట్రేష‌న్ చేశాడు. మే- 11న ఇంచార్జీ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించి, నిబంధనలకు విరుద్దంగా రాత్రి రాత్రికే రిజిస్టేషన్లు చేశాడు రతన్.  అక్రమ రిజిస్ట్రేషన్లపై మీడియాలో వార్త‌లు రావడంతో  ప్రతిపక్ష పార్టీ నేతలు రిజిస్ట్రేష‌న్ల శాఖ‌కు పిర్యాదు చేశారు. దీంతో ర‌త‌న్ ను సస్పెండ్ చేస్తున్న‌ట్లు గురువారం తెలిపింది రిజిస్ట్రేషన్ల శాఖ.