ఇయ్యాల్టి నుంచి ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలు బంద్‌‌

ఇయ్యాల్టి నుంచి ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలు బంద్‌‌
  • డీఎంఈకి సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు 

పద్మారావు నగర్, వెలుగు: నీట్‌‌ పీజీ 2021 కౌన్సెలింగ్‌‌లో జరుగుతున్న ఆలస్యానికి నిరసనగా జూనియర్‌‌‌‌ డాక్టర్లు చేపట్టిన సమ్మెను మరింత ఉధృతం చేయనున్నారు. శుక్రవారం నుంచి ఎమర్జెన్సీ సేవలు మినహా మిగిలిన ఎలెక్టివ్‌‌ లాంటి అన్ని రకాల సాధారణ సేవలను బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర జూనియర్‌‌‌‌ డాక్టర్ల అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్‌‌ డాక్టర్‌‌‌‌ సాగర్‌‌‌‌,​ జనరల్‌‌ సెక్రటరీ డాక్టర్‌‌‌‌ కార్తీక్‌‌లు తెలిపారు. ఈ మేరకు డీఎంఈ కె.రమేశ్‌‌ రెడ్డికి సమ్మె నోటీసును ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే జూడాలు అవుట్‌ పేషెంట్ సేవలను బాయ్‌‌కాట్‌‌ చేశారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జూనియర్‌‌‌‌, రెసిడెంట్‌‌ డాక్టర్లు చేస్తున్న నిరసనలపై కేంద్రం స్పందించకపోవడంతో తమ ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు చెప్పారు.