సుప్రీం కోర్టు 47 వ ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బోబ్డే ప్రమాణ స్పీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. బోబ్డే 17 నెలల పాటు సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఉండనున్నారు. ఏప్రిల్ 13, 2021 న ఆయన రిటైర్ కానున్నారు.అయోధ్యలో భూవివాదం, రైట్ టు ప్రైవసీ వంటి చరిత్రాత్మకమైన తీర్పులను వెలువరించిన బెంచ్ లలో జస్టిస్ బోబ్డే కీలక పాత్ర పోషించారు.
బోబ్డే ప్రొఫైల్
- మహారాష్ట్ర లోని నాగ్పూర్ లో 1956 ఏప్రిల్ 24న పుట్టారు
- తండ్రి లాయర్ అరవింద్ శ్రీనివాస్ బోబ్డే
- నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ ఎల్ బీ
- 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్ గా రిజిస్టర్ చేసుకున్నారు
- 21 ఏళ్లపాటు లాయర్ గా సేవలు
- 1998లో సీనియర్ అడ్వకేట్ గా ప్రమోషన్
- 2000 మార్చి 29న బాంబే హైకోర్టు లో అడిషనల్ జడ్జిగా బాధ్యతలు
- 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా ప్రమాణం
- 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్
Delhi: Justice Sharad Arvind Bobde sworn-in as the 47th Chief Justice of India. pic.twitter.com/f47aS4wipv
— ANI (@ANI) November 18, 2019