ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ ప్రేమించుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ జోడీ నిశ్చితార్థం కూడా జరిగింది. లేటెస్టుగా పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 22న తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
తమ కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో తాము పెళ్లి చేసుకోబోతున్నామని తెలిపారుగుత్తా జ్వాల, విష్ణు విశాల్. ఇన్నేళ్లుగా తమపై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు వారిద్దరూ కలిసి ప్రకటన చేశారు.