టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, ముంబైకి చెందిని బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ఒక్కటయ్యారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువుల సమక్షంలో శుక్రవారం ముంబైలో వాళ్ల పెళ్లి వేడుక జరిగింది. ఆ ఫొటోలను ఫిల్మ్ క్రిటిక్ రమేశ్ బాలా ట్విట్టర్లో షేర్ చేశారు.
ముంబైలోని ఓ హోటల్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. కొన్ని రోజుల క్రితమే తన పెళ్లి గురించి ప్రస్తావించిన కాజల్.. కోవిడ్ నిబంధనల వల్ల తక్కువ మందితో జరుగుతున్నట్లు చెప్పింది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందకు తానుచాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నందకు మీ సపోర్ట్ కావాలని..తమను ఆశీర్వదించాలని కోరింది. పెళ్లి తర్వాత కూడా తాను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని ట్వీట్ చేసింది కాజల్. ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి, కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఆచార్యలో నటిస్తుంది. అలాగే తమిళ్ లో కమల్ హాసన్,శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు 2 లో నటిస్తుంది.