మేడమ్ టుస్సాడ్స్‌లో కాజల్ విగ్రహం

మేడమ్ టుస్సాడ్స్‌లో కాజల్ విగ్రహం

లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఎంతోమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేసిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఇప్పుడు కాజల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే మ్యూజియం సిబ్బంది కాజల్ కొలతలు కూడా తీసుకున్నారు. ఆ ఫోటోను జతచేస్తూ కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొట్టమొదటి హీరోయిన్ కాజల్ కావడం విశేషం.

కాగా.. దక్షిణాది నుంచి ఈ ఘనతను సొంతం చేసుకున్న వారిలో డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ముందున్నారు. కానీ, హీరోయిన్‌లలో మాత్రం కాజలే మొదటి వ్యక్తి. ఎంతోమంది అగ్రకథానాయకుల సరసన నటించి మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇటు తెలుగుతో పాటు, అటు తమిళంలోనూ నటిస్తూ.. అప్పుడప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తుంది కాజల్.