రూ.8 కోట్లతో ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేసిన కాజోల్

రూ.8 కోట్లతో ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేసిన కాజోల్

బాలీవుడ్ నటి కాజోల్ ముంబైలోని ఓషివారాలో రూ. 7.64 కోట్ల విలువైన ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆమె భర్త అజయ్ దేవగన్ రూ. 45 కోట్లతో ఐదు ఫ్లాట్లను కొనుగోలు చేసిన భవనంలోనే ఈ ఆస్తి ఉన్నట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి.

ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని సిగ్నేచర్ బిల్డింగ్‌లో ఉన్న 194.67 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాతో కాజోల్.. ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు ఈ నివేదిక తెలిపింది, జూలై 28న ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. జూలైలో, ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో మొత్తం రూ. 45.09 కోట్లతో ఐదు ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశాడు. డేటా అనలిటిక్స్ సంస్థ సిఆర్‌ఇ మ్యాట్రిక్స్ పొందిన పత్రాల ద్వారా కొనుగోలు వివరాలు వెల్లడయ్యాయి. సిగ్నేచర్ బిల్డింగ్, ఓషివారా, వీర దేశాయ్ రోడ్ వెంబడి ఉన్న ఈ కార్యాలయ యూనిట్లు ఏకంగా 13,293 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. యూనిట్ల అమ్మకందారు వీర్ సావర్కర్ ప్రాజెక్ట్స్.

ఈ ఐదు యూనిట్లలో, 16వ అంతస్తులో ఉన్న మూడు యూనిట్ల విలువ రూ. 30.35 కోట్లు. స్టాంప్ డ్యూటీ చెల్లింపు రూ.1.82 కోట్లు. ఈ యూనిట్లు 8,405 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడి ఉన్నాయి. దీనికి అదనంగా, దేవ్‌గన్ 17వ అంతస్తులో 4వేల 893 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాలో రెండు ఆఫీస్ యూనిట్లను రూ.14.74 కోట్లకు కొనుగోలు చేశాడు. ఈ యూనిట్లకు చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ. 88.44 లక్షలు.

ఈ రెండు కొనుగోలు పత్రాల రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 19, 2023న జరిగింది. విశాల్ (అజయ్) వీరేందర్ దేవగన్ స్క్రీన్ నేమ్ అజయ్ దేవగన్‌గా ఉన్నందున ఆస్తులు అతని పేరుతో రిజిస్టర్ చేశారు. 2021లో, దేవగన్ ముంబైలోని జుహులో 474.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 47.5 కోట్లకు బంగ్లాను కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలు కోసం అతను రూ. 18.75 కోట్ల లోన్ తీసుకున్నాడు.