కేసీఆర్​ పనులు చూసి తుగ్లక్​ కూడా సిగ్గుపడుతాడు: మంత్రి ఉత్తమ్​

కేసీఆర్​  పనులు చూసి తుగ్లక్​ కూడా సిగ్గుపడుతాడు: మంత్రి ఉత్తమ్​

కాళేశ్వరం లాంటి కుంభకోణం  ప్రపంచంలో మరొకటి ఉండదని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్​ ప్రారంభించారన్నారు.  కేసీఆర్​ చేసిన పనులు చూసి తుగ్లక్​ కూడా సిగ్గుపడుతారని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు.  14 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించారని మంత్రి అన్నారు.  ప్రాజెక్ట్​ డ్యామేజ్​ పై కేసీఆర్​ ఇంతవరకు మాట్లాడలేదన్నారు. 

నాలుగేళ్లుగా  ప్రాజెక్ట్​ల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.  బ్యారేజ్​ లో కొన్ని నీళ్లు ఉంటేనే 18 వ పిల్లర్​ నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయన్నారు. నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ కూడా నిర్మాణంలో లోపం ఉందని నివేదిక ఇచ్చిందన్నారు.   మేడిగడ్డ ప్రాజెక్ట్​ విషయంలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను విచారణ జరిపిస్తామన్నారు.  గత ప్రభుత్వంలో ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ పనితీరులో వైఫల్యం చెందిందన్నారు.   

Also Read:నల్లగొండకు కాదు... అసెంబ్లీకి రండి