- ఇప్పటికే ప్రైమరీ డీపీఆర్ రెడీ బోర్హోల్స్ పర్మిషన్ కోసం పీసీసీఎఫ్ కు లెటర్
- ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ రాగానే టెండర్లు పిలిచేందుకు ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు : గ్రీన్ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్న కల్లూరు పంప్డ్స్టోరేజీ ప్రాజెక్ట్(పీఎస్పీ)ను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఖమ్మం జిల్లాలో రూ.8,888 కోట్లతో 1,500 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక రెడీ చేసిన జెన్కో డీపీఆర్తయారీకి సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్నిర్మాణ స్థలంలో 23 చోట్ల బోర్హోల్స్ వేయడానికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్నుంచి పర్మిషన్ తీసుకునేందుకు పీసీసీఎఫ్ఆఫీస్ కు లెటర్ రాశారు. ఆరు నెలల్లో ఎన్విరాన్మెంటల్క్లియరెన్స్తీసుకొని టెండర్లు పిలవడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.
తొలి పంప్డ్ స్టోరేజ్ఇదే..!
నెట్జీరోలో భాగంగా రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలో 4,750 మెగావాట్లు, 2035 నాటికి 7,500 మెగావాట్ల సామర్థ్యం గల గ్రీన్ఎనర్జీ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జెన్కో 13 సైట్లను గుర్తించింది. మొత్తం 12,850 మెగావాట్ల పీఎస్పీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.71,210 కోట్లు ఖర్చు కానున్నట్లుగా లెక్కలు తేల్చారు. అయితే నిధుల లేమితో ఇబ్బంది పడుతున్న సర్కారు, ప్రయారిటీ ప్రకారం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి ప్రాధాన్యత లిస్ట్ లో ఉన్న ఖమ్మం జిల్లాలోని కల్లూరు ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం టేకప్చేసింది.
ఇక్కడ 1,500 మెగావాట్స్సామర్థ్యం గల పీఎస్పీ ప్రాజెక్ట్ను రూ.8,888 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్కు అవసరమైన 0.40 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్లెఫ్ట్కెనాల్నుంచి తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. డిటైల్డ్ప్రాజెక్ట్ రిపోర్ట్తయారు చేసేందుకు హైదరాబాద్లోని ఆర్ వీ ఇంజినీరింగ్కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు. డీపీఆర్తో పాటు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు, ఇతర అన్ని రకాల క్లియరెన్స్లు తీసుకురావడానికి ఫీజు కింద రూ.7.75 కోట్లను చెల్లించి గతేడాది నవంబర్4న అగ్రిమెంట్చేసుకున్నారు.
కేంద్రం నుంచి రూ.1,325 కోట్ల సబ్సిడీ
కల్లూరు పంప్డ్స్టోరేజ్ప్లాంట్నిర్మాణానికి కేంద్రం నుంచి సబ్సిడీ అందనుంది. పీఎస్పీ ప్లాంట్నిర్మాణంలో ఒక మెగావాట్కు రూ.0.75 కోట్ల చొప్పున రూ.1,125 కోట్లు, ప్రైమరీ సబ్సిడీగా మరో రూ.200 కోట్లు అందించనున్నారు. ఈ నిధులతో ప్లాంట్నుంచి గ్రిడ్వరకు ట్రాన్స్మిషన్లైన్లు, రోడ్లు, డ్రైనేజీ, ఇతర అనేక రకాల అభివృద్ధి పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
పీసీసీఎఫ్ఆఫీస్ కు లేఖ రాసిన జెన్కో
ప్రాజెక్ట్ డిటెయిల్డ్ రిపోర్ట్ రెడీ చేయడానికి మూడు ఇంచుల డయాతో 23 చోట్ల బోర్హోల్స్వేసి సాయిల్రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ ల్యాండ్లో కొంత భాగం ఫారెస్ట్ డిపార్ట్మెంట్పరిధిలో ఉండడంతో బోర్హోల్స్వేసేందుకు అనుమతి కోరుతూ జెన్కో ఆఫీసర్లు ఆఫీస్ కు లెటర్ రాశారు. అనుమతులు రాగానే ఆరు నెలల్లో సాయిల్ టెస్ట్లు పూర్తి చేసి రిపోర్ట్ఆధారంగా టెండర్లు పిలవనున్నారు.
త్వరలోనే టెండర్లు పిలుస్తం
కల్లూరు పీఎస్పీ ప్లాంట్ఏర్పాటు వర్క్స్పీడ్ గా జరుగుతోంది. 1,500 మెగావాట్ల ప్లాంట్ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి వచ్చింది. ప్రాజెక్ట్ సైట్లో సాయిల్ టెస్ట్లు పూర్తి చేసి టెండర్లు పిలవడానికి ఫైల్రెడీ చేస్తున్నాం. జెన్కో ఇంజినీర్లు కొద్ది నెలలుగా ఆర్ వీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థతో కలిసి ప్రాజెక్ట్పై ఫోకస్ పెట్టారు.
హరీశ్, జెన్కో సీఎండీ
