సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్న చిత్రం ‘అంతా రాములోరు చూస్కుంటారు’. ఆదివారం టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ‘-మనం దేవుడు చూసుకుంటాడు అని ఆయన మీద ఎంతో కొంత భారం పెడుతుంటాం.
కానీ ఈ సినిమాలో హీరో మారుతి వందశాతం దేవుడి మీద వదిలేస్తాడు. అంతా రాములోరు చూస్కుంటారు అని నమ్మి బతికేస్తుంటాడు. ఇది లవ్ స్టోరీతో పాటు బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఫిలిం’ అని చెప్పాడు. ఈ చిత్రంలో తాను శిరీష పాత్ర పోషిస్తున్నానని.. మారుతి, శిరీష క్యారెక్టర్స్ను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారని హీరోయిన్ అనస్వర రాజన్ చెప్పింది.
డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ మాట్లాడుతూ ‘ గోదావరి బ్యాక్డ్రాప్లో రూపొందించిన చిత్రమిది. ఈ టైటిల్ వెనుక పెద్ద కాన్సెప్ట్ ఉంది. హీరో హీరోయిన్ జోడీ అందర్నీ మోటివేట్ చేస్తుంది’ అని చెప్పాడు. - ఎంటర్టైన్మెంట్తో కూడిన లవ్ స్టోరీనే ఈ చిత్రమని నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని అన్నారు.
