ఆయుష్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు.. ఆక్టోబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులు

ఆయుష్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు..  ఆక్టోబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులు
  • ఆయుష్ మెడికల్ కోర్సుల్లో  ప్రవేశాలు 
  • 2వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ 

వరంగల్​సిటీ, వెలుగు : యూజీ ఆయుష్ మెడికల్ కోర్సులో  ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ,  ప్రైవేట్ ఆయుష్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా  బీఏఎంఎస్,  బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ , బీఎన్ వైఎస్  కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వచ్చే నెల  2వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.  

ఎంబీబీఎస్  స్ర్టే వేకెన్సీ నోటిఫికేషన్ 

​ఎంబీబీఎస్  కన్వీనర్ కోటా సీట్లకు 25వ తేదీ(సోమవారం) సాయంత్రం  4 గంటల  నుంచి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. 26 వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్ర్టే వేకెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో  ఏంబీబీఎస్ కన్వీనర్ కోటా  సీట్లకు  ఇప్పటికే  మూడు  విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది.  ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను  ఈ  రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు.   అర్హత, నిబంధనలు ఇతర వివరాలకు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్ ను సంప్రదించాలని వర్శిటీ అధికారులు పేర్కొన్నారు. కాగా..వెబ్ ఆప్షన్లకు కేవలం 24 గంటలు మాత్రమే గడువు ఇవ్వడంపై  స్టూడెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.