50ఏళ్ల వయసులోనూ టబు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నరు : కంగనా రనౌత్

50ఏళ్ల వయసులోనూ టబు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నరు : కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్, హీరోయిన్ టబుపై ప్రశంసలు గుప్పించారు. ఆమె ఒంటి చేత్తో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని రక్షిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం భూల్ భూలయ్య 2, దృశ్యం 2 హిట్ లలో టబు అలరించారన్న కంగనా.. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె ప్రధాన పాత్రలు పోషించారని చెప్పారు. 50ఏళ్ల వయసులోనూ ఆమె అద్భుతమైన ప్రదర్శనను కనబర్చారు. ఈ వయసులోనూ టబు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారన్నారు. మహిళలు తమ పని పట్ల అచంచలమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నందుకు.. వారికి మరింత గౌరవం దక్కాలని తాను భావిస్తున్నట్టు కంగనా అభిప్రాయపడ్డారు.

'దృశ్యం 2' తొలి రోజున రూ. 15.38 కోట్లు వసూలు చేసింది. 2022లో రిలీజైన హిందీ చిత్రాలలో ఈ చిత్రం మొదటి రోజు రెండవ అత్యధిక కలెక్షన్‌లు రాబట్టిన మూవీగా నిలిచింది. అభిషేక్ పాఠక్ హెల్మ్ చేసిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియా శరణ్, అక్షయ్ ఖన్నా లు ప్రధాన పాత్రలు పోషించారు. మరోవైపు 'భూల్ భూలయ్యా 2' బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వ వహించిన 'కుట్టే'లోనూ టబు కనిపించనున్నారు. ఈ మూవీలో అర్జున్ కపూర్, నసీరుద్దీన్ షా, కొంకణా సెన్ శర్మ, రాధిక మదన్‌లు నటిస్తున్నారు.