సోనియాకు కంగన రిక్వెస్ట్

సోనియాకు కంగన రిక్వెస్ట్

ముంబై: రైతుల నిరసనలపై కామెంట్లు చేసినందుకు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏ కులమతాలను గానీ, వర్గాలను గానీ కించపర్చేలా ఎప్పుడూ మాట్లాడలేదని ఆమె చెప్పారు. ఫిర్యాదు కాపీని ఆమె మంగళవారం సోషల్​ మీడియాలో షేర్ చేశారు. భటిండాకు చెందిన ఒకరు తనను చంపేస్తానని బెదిరించారని, కానీ ఇలాంటి బెదిరింపులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసేవాళ్ల గురించి ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడతానని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకునేలా పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కంగన కోరారు.

దేశంపై కుట్రలను సహించను

దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న ఎలాంటి శక్తులనైనా తాను వ్యతిరేకిస్తానని కంగనా చెప్పారు. ‘‘ఖలిస్తాన్​ను ఏర్పాటు చేయాలని కలలు కంటూ విదేశాల్లో కూర్చున్న టెర్రరిస్టులైనా.. ఇంకెక్కడైనా ఉన్న తుక్డే తుక్డే గ్యాంగ్​లైనాసరే.. వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడటం కొనసాగిస్తా. ప్రజాస్వామ్యమే మన దేశానికి బలం. ప్రజల ఐక్యత, హక్కులను కాపాడుకునేందుకు అంబేద్కర్ రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది”అని కంగన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశారు.