
బాలీవుడ్ స్టారీ హీరోయిన్ కరీనా కపూర్ కు విహారయాత్రలపై, ప్రయాణాలపై ఉన్న అభిరుచిని ఇన్స్టాగ్రామ్ వేదికగా మరోసారి బయటపెట్టింది. తన కొడుకులు, భర్త సైఫ్ అలీ ఖాన్ తో ఉన్న ఫొటోలను కరీనా పంచుకుంది. సుందరమైన ప్రదేశాల్లో తరచుగా తళుక్కుమనే ఈ తార ఈ సారి.. తన ఇద్దరు కుమారులు తైమూర్, జెహ్లతో కలిసి కుటుంబ విహారయాత్రలో ఎంజాయ్ చేస్తోంది. ఇటలీలోని ఫ్లోరెన్స్లోని ఆర్నో నదిపై ఆర్చ్ బ్రిడ్జ్ వద్ద పింక్ అండ్ వైట్ కో-ఆర్డ్ సెట్లో మేకప్ లేకుండా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. కరీనా పోస్ట్ చేసిన ఓ ఫొటోలో తైమూరు ను కరీనా ఎత్తుకొని ఉండగా, మరొక ఫొటోలో స్ట్రోలర్ లో తైమూర్ ఉండడాన్ని గమనించవచ్చు. వీటికి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే క్యాప్షన్ చేసింది కరీనా. ఇక కరీనా షేర్ చేసిన మరొక పోస్ట్ లో స్విమ్మింగ్ ఫూల్ లో సైఫ్ అలీ ఖాన్ తో తైమూర్ ఉన్న పిక్ ను పంచుకోవడంతో పాటు... ఇంతలో.. (Meanwhile...) అనే క్యాప్షన్ ను జత చేస్తూ స్మైల్ ఎమోజీని షేర్ చేసింది.