కర్ణాటక ప్రభుత్వం 2024 జనవరి 1 నుంచి యువనిధి పథకాన్ని ప్రారంభించనుంది. నిరుద్యోగులందరికి నిరుద్యోగ భృతిని అందించడమే ఈ పథకం లక్ష్యం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో ఇదొక స్కీం. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ. 1500 నుంచి 3000 వేలు ఇస్తారు.
అర్హులైన నిరుద్యోగులు సేవా సింధు వెబ్ సైట్ లో డిసెంబర్ 26 నుంచి అప్లై చేసుకోవచ్చు. 2022- 23 విద్యాసంవత్సరంలో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆరు నెలల వరకు జాబ్ లేని వారు అప్లై చేసుకోవడానికి ఈ పథకానికి అర్హులు. డిగ్రీ, డిప్లొమా పాస్ హెల్డర్లకు ఈ పథకం వర్తిస్తుంది. డిగ్రీ చేసిన నిరుద్యోగులకు ఈ పథకం కింద నెలకు రూ.3000, డిప్లొమా చేసిన వారికి రూ. 1500 ఆర్థిక సాయం అందిస్తారు. గరిష్టంగా రెండేళ్ల పాటు ఉద్యోగం చేసే వరకు ఈ డబ్బు లబ్దిదారుని అకౌంట్లో నేరుగా బదిలీ అవుతుంది.
ఈ పథకం కింద ఎవరు అర్హులు?
- నిరుద్యోగ యువత కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ఉండాలి
- దరఖాస్తు చేసేటప్పుడు యువకులు నిరుద్యోగులుగా ఉండాలి
- నిరుద్యోగ యువత , గ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసి నిరుద్యోగులుగా ఉండాలి
- నిరుద్యోగ యువతకు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్లో నమోదు తప్పనిసరి
యువ నిధి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్.?
- కర్ణాటక రెసిడెన్సీ: కర్ణాటకలో ఉంటున్నట్టు, ఓటరు గుర్తింపు కార్డు
- పాస్ పోర్ట్
- దరఖాస్తుదారుఆధార్ కార్డ్
- టెన్త్ క్లాస్ మెమో, సర్టిఫికెట్
- ఇంటర్ మెమో, సర్టిఫికెట్
- గ్రాడ్యుయేషన్ మెమో, సర్టిఫికేట్
- డిప్లొమా సర్టిఫికేట్ (డిప్లొమా హోల్డర్ దరఖాస్తుదారులు)
- కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం
- దరఖాస్తుదారు మొబైల్ నంబర్
- దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా వివరాలు
- కుల ధృవీకరణ పత్రం. (ప్రత్యేక కులానికి చెందినవారైతే)