కార్తీక పౌర్ణమి శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన రోజు. ఈ ఏడాది (2025) కార్తీక పౌర్ణమి నవంబర్ 5 వ తేది వచ్చింది. ఆ రోజున నిద్రలేచి, స్నానం చేసి దేవాలయాలకు వెళ్లి శివుడ్ని దర్శించుకుంటారు. సాయంత్రం ఉసిరికాయ దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో ఆవు నెయ్యిపోసి, దీపాలు వెలిగిస్తే మంచిదని చెప్తారు. ఆవునెయ్యి దొరకని వాళ్లు నువ్వుల నూనె వాడుతారు. ప్రతి ఇంటి ముందు. దీపాలు వెలిగిస్తారు.
కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో దీపం వెలిగిస్తే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం. ఈ రోజు పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తారు. అలాగే కేదారేశ్వర వ్రతం చేస్తే శుభాలు జరుగుతాయని అంటారు. ఈ రోజు విష్ణువుని మత్స్యావతారంలో అలంకరిస్తారు. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలం దానం చేస్తారు. వాటితో పాటు కార్తీకపురాణ విశేషాలు తెలిపే పుస్తకాలు కూడా దానం ఇస్తే మంచిదని నమ్ముతారు.
కార్తీక పౌర్ణమికి పురాణ నేపథ్యం ఉంది. మహాభా రతం ప్రకారం కార్తీకేయుడు తారకాసురుడి నం హరించింది ఈ రోజే రాక్షసపాలన అంతమైందని ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి ఈ రోజును పండుగగా జరుపుకున్నారట. కొందరు కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు. కేదారేశ్వరునికి మర్రి ఊడలను తోరణాలుగా కడతారు. మర్రి పళ్లతో బూరెలు వండుతారు. మర్రి ఆకుల్లో ప్రసాదాన్ని పెట్టి పూజలు చేస్తారు. తులసి మాత కూడా ఈ రోజే పుట్టిందట. అందువల్ల తులసిపూజ చేయడం వల్ల శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు. జైములు, పంజాబీలకు కార్తీక పౌర్ణమి ముఖ్యమైన రోజు.. గురునానక్ పుట్టిన రోజు కూడా ఈ రోజే. కార్తీక పూర్ణిమనే త్రిపురి పూర్ణిమ... దేవ దీపావళి అని కూడా పిలుస్తారు.
తారకాసురుని కొడుకుల ముగ్గురు బ్రహ్మ కోసం తపస్సు చేసి 'రథంకాని రథం మీద, విల్లుకాని విల్లుతో, బాణం కానీ బాణంతో, ఒకే సరళరేఖలో మాత్రమే చనిపోయే విధంగా వరం పొందుతారు. వాళ్ల పాపాలు పెరిగిపోవడంతో శివుడు భూమిని రథంగా.... మేరు పర్వతాన్ని విల్లుగా... ఆదిశేషుడిని అల్లెతాడుగా... మహా విష్ణువును బాణంగా మార్చి త్రిపురాసురులను సంహారించాడని పురాణాలు చెప్తున్నాయి.
►ALSO READ | కార్తీకపౌర్ణమి2025: 365 వత్తులు ఎవరు వెలిగించాలి... శుభముహూర్తం.. పాటించాల్సిన నియమాలు ఇవే..!
కార్తీకపౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి దేవాలయాలకు వెళ్లి శివుడ్ని దర్శించుకుంటా రు. సాయంత్రం ఉసిరికాయ దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో ఆవునె య్యి పోసి, దీపాలు వెలిగిస్తే మంచిదంటారు. ఆవు నెయ్యి దొరకని వాళ్లు నువ్వుల నూనె వాడుతారు. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు. శివా లయాలు సాయంత్రానికల్లా దీపాలతో ప్రకాశి స్తాయి. కొలనులు, కోనేరులు, నదులు... అన్నీ భక్తులు వెలిగించిన దీపాల దోసలతో కాంతులు వెదజల్లుతాయి. కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి శివాలయాలలో ఆకాశదీపాన్ని వెలిగిస్తా డు. కార్తీక పౌర్ణమిరోజు ఆ ఆకాశ పాన్ని దర్శించు కుంటే శివుడిని చూసినంత భాగ్యం కలుగుతుందనిభక్తుల విశ్వాసం. సాయంత్రం తమ శక్తికొలదీ పేదలకు దానం చేస్తారు.
దీపం: కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపానికి ప్రత్యేకత ఉంది. 365 ఒత్తులతో శివాలయంలో దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుందని అంటారు. అంటే.. ఒక్కోరోజుకు ఒక్కో ఒత్తి అన్నమాట. దీపాలను అరటి దోసలో పెట్టి దేవాలయంలోని కోనేటిలో, నదుల్లో వదులుతారు. కార్తీకపౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇంటి ముందు తు లసికోట దగ్గర వెలిగిస్తే సర్వదోషాలు పోతాయట.
ఈ రోజు 'ఓం త్రయంబకం యజామయే సుగంధిమ్ పుష్టివర్ధనం ఊర్వారుకమివి బంధా వాన్ మృత్యోర్ మృక్తియ మమ్మలాత్' అనే మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే రోగాలు దరిచేరవని భక్తుల నమ్మకం. పెళ్లైన యువతలు దీపాలను అరటి దోనెల్లో వదలడం వల్ల మంగళ ప్రదంగా జీవిస్తారని నమ్ముతారు.
జ్వాలాతోరణం: కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో జ్వాలాతోరణం వెలిగిస్తారు. ఈ తోరణం కిందనుంచి అటు ఇటు వెళ్లడం వల్ల మానసిక ప్రశాంత లభిస్తుంది ని నమ్ముతారు. పాలసముద్రంలో పుట్టిన విషాన్ని పరమేశ్వరుడు మింగిన తర్వాత వేడిని తట్టుకో లేక పోతాడు. వేడి తగ్గించమని పార్వతీదేవి అగ్నిని వేడుకుంటుంది. అగ్ని తన సహజ స్వభావాన్ని కొంత తగ్గించుకుంటాడు. అందుకు కృతఙ్ఞతగా పార్వతీదేవి కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం కడుతుంది. ఆ తోరణం కిందనుంచి భార్యాభర్త లిద్దరూ వెళ్లారు.
అప్పటి నుంచి కార్తీక పౌర్ణమి. రోజు శివాలయాల్లో జ్వాలాతోరణాలు ఏర్పాటు చేయటం ఆచారంగా మారిందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.. దీనిని చూసిన మనుషులకు, జంతువులకు, పక్షులకు క్రిమికీటకాలకు కూడా మరోజన్మ ఉండదని నమ్ముతారు. జ్వాలా తోరణం కాల్చిన తర్వాత మిగిలిన బూడిదను సుదుటి మీద పెట్టుకుంటే భూత, ప్రేత, పిశాచాల పీడ ఉండడని విశ్వసిస్తారు.
ఆరోగ్యప్రదం: పౌర్ణమి రోజు నిండు చంద్రుడు కాంతివంతంగా కనిపిస్తాడు. భూమి మీద చల్లని కాంతులను ప్రసరింపజేస్తాడు. కార్తీకపౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు శరీరం మీద పడితే నరాలు. ..కళ్లకు. సంబంధించిన చిన్నచిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గు తాయి. పైగా మిగిలిన పౌర్ణమిల కన్నా ఈ రోజు చంద్రుడి కాంతి ఎక్కువగా ఉంటుంది. అందుకే.. నాలుగు నుంచి అయిదు నిముషాలు తప్పకుండా చంద్ర కాంతి శరీరం మీద పడేలా చూసుకో వాలి. రోజంతా ఉపవాసం ఉండి దీపారాధన చేసి, చలిమిడిని దేవుడికి ప్రసాదంగా పెడతారు. సాయంత్రం చలిమిడిని తినడం వల్ల పొట్టకు చలువ చేస్తుంది. చలిమిడి స్త్రీలలో గర్భాశయానికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుందంటారు
వెలుగుల్లో దేవాలయాలు..శివాలయాలు... వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం6 గంటలకే భక్తులు స్నానాలు చేసి దేవుడి దర్శనం కోసం ఆలయాలకు క్యూ కడతారు. స్వామివారిని దర్శనం చేసుకుని తీర్దప్రసాదాలు స్వీకరిస్తారు.  ఉపవాసం ఉండటం వల్ల దేవాలయంలోనే ఎక్కువసమయం గడుపుతారు. అక్కడ కార్తీకపురాణాన్ని పారాయణం చేస్తారు . కాబట్టి వింటూ ఆనందిస్తారు. కొందరు ఈ రోజు సత్యన్నారాయణ స్వామి ప్రతాన్ని కూడా చేసుకుంటారు. ఇంకా కార్తీకవ్రతం, నోములు వంటివి. ఆచారాలను బట్టి పాటిస్తారు. . .  .
వెలుగు, లైఫ్
