రాజన్న, సమ్మక్క ఆలయాలను కేసీఆర్ పట్టించుకోలే: మంత్రి సీతక్క

రాజన్న, సమ్మక్క ఆలయాలను కేసీఆర్ పట్టించుకోలే: మంత్రి సీతక్క

హైదరాబాద్: రాజన్న, సమ్మక్క ఆలయాలను మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం (జనవరి 16) వేములవాడ రాజన్న ఆలయాన్ని సీతక్క దర్శించుకున్నారు. శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణంను సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చేస్తున్నారని తెలిపారు. సమ్మక్క జాతర నేపథ్యంలో ముందుగా వేములవాడ లో స్వామి వారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నానని తెలిపారు. 

వేములవాడ రాజన్న, సమ్మక్క సారలమ్మను ఎక్కువగా పేద ప్రజలు దర్శించుకుంటారని.. కానీ ఇటీవల ఉన్నత వర్గాలు కూడా వస్తున్నారన్నారు. నాలుగు రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తామన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో రాజన్న, సమ్మక్క గుళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాజన్న గుడి డెవలప్ అవుతుందంటే అది శ్రీనివాస్ కృషేనని అన్నారు. 

Also Read : సంక్రాంతికి వెళ్లి హైదరాబాద్ తిరిగొచ్చే వారికి బిగ్ అలర్ట్

సీఎం రేవంత్ రెడ్డి సాధారణ భక్తుల మనోభావాలను గుర్తిస్తున్నారన్నారు. గతంలో రాజన్న గుడిని డెవలప్ చేయవద్దని దుష్ప్రచారాలు చేశారని.. కానీ భక్తుల మనోభావాలను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నారని చెప్పారు. జనవరి 18న మేడారంలో కేబినెట్ మీటింగ్ ఉందని చెప్పారు. 19న సమ్మక్క సారలమ్మ గుడిని పునః ప్రారంభించబోతున్నామని తెలిపారు.