- దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో రాచరిక వ్యవస్థను తిరిగి తీసుకురావాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తన ఏడేళ్ల పాలనలో అనేక వ్యవస్థలను నాశనం చేశారన్నారు. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగంపైనే దాడి చేస్తున్నారన్నారు. కేసిఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క.
ఇవి కూడా చదవండి..
కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు
అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనకు దిగుతాం