న్యూఢిల్లీ:రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన జీటీపీఎల్ హాత్వే లిమిటెడ్ యాక్ట్ గ్రూప్ కేబుల్ టీవీ వ్యాపారాన్ని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలును రూ. 36.23 కోట్ల నగదు చెల్లింపుతో బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ద్వారా పూర్తి చేయనున్నారు.
యాక్ట్ గ్రూపునకు చెందిన ఏసీఎన్ కేబుల్, ఏసీటీ డిజిటల్ హోమ్ ఎంటర్టైన్మెంట్, ఏట్రియా బ్రాడ్బాండ్ సర్వీసెస్, కేబుల్ ఫస్ట్ ఇండియా, శ్రీ వెంకటేశ్వర డిజిటల్ హోమ్ ఎంటర్టైన్మెంట్, మండపేట డిజిటల్ ఎంటర్టైన్మెంట్, ఐబీ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ అనే ఏడు సంస్థలను స్లంప్ సేల్ ప్రాతిపదికన కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది.
ఇవన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నాటికి డీల్ పూర్తవుతుంది.
