తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ : కేసీఆర్​

తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ : కేసీఆర్​
  • పార్లమెంట్ బడ్జెట్ ​సెషన్​లో ఇది రిఫ్లెక్ట్​ కావాలి 
  • కేఆర్ఎంబీకి ప్రాజెక్టులఅప్పగింతపై ప్రశ్నించండి
  • విభజన అంశాలనూప్రస్తావించండి
  • బీఆర్ఎస్​ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సూచన

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ అంటేనే బీఆర్ఎస్​అని.. పార్లమెంట్​బడ్జెట్​సమావేశాల్లో ఇది రిఫ్లెక్ట్​అయ్యేలా పనిచేయాలని తమ పార్టీ ఎంపీలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్​​కేసీఆర్​దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్​లో బీఆర్ఎస్​పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. 3 గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్​సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

కాంగ్రెస్​నుంచి ఉభయ సభల్లో తెలంగాణ సభ్యులే లేరు.. గతంలో ముగ్గురు ఉన్నా.. వాళ్లు రాష్ట్ర ప్రయోజనాలపై గళమెత్తింది లేదు.. బీజేపీ ఎంపీలు నలుగురున్నా వారి పార్టీ హైకమాండ్​చెప్పినట్టే మాట్లాడుతరు.. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఎప్పటికైనా బీఆర్ఎస్​ఒకటే​అనేది ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలే..” అని కేసీఆర్​సూచించారు. ‘‘శ్రీశైలం, నాగార్జున సాగర్​ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్రం ఒత్తిడి చేసినా బీఆర్ఎస్​ప్రభుత్వం తలొగ్గలేదు..

కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన వెంటనే ఒప్పుకుంది.. దీంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతది.. ఈ విషయాన్ని ఉభయ సభల్లో గట్టిగా వివరించాలి..” అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల ఆపరేషన్​ప్రొటోకాల్, కృష్ణా జలాల్లో నీటి పంపకాలు తేలకుండా ప్రాజెక్టులను బోర్డుకు ఎలా అప్పగిస్తారనే దానిపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఉభయ సభల్లో దీనిపై నిరసన తెలపాలన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావించి వాటిని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. 

కాంగ్రెస్ ​సర్కారు తప్పించుకోవాలని చూస్తున్నది

అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేక కాంగ్రెస్​అలవికాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు వాటి అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నదని కేసీఆర్ ఆరోపించారు. దీనిని ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. తాను కోలుకున్న తర్వాత ప్రజల్లోకి వస్తానని చెప్పారు. బడ్జెట్​సెషన్​తర్వాత ఎంపీలు కార్యక్షేత్రంలోకి దిగాలన్నారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్​ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని క్షేత్ర స్థాయి నుంచి ఫీడ్​బ్యాక్​వస్తున్నదని, దీనిని సమర్థంగా ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షం అనేది స్పష్టంగా తెలియజెప్పాలని కేసీఆర్​సూచించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు, పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, లోక్​సభ పక్షనేత నామా నాగేశ్వర్​రావు, ఎంపీలు పాల్గొన్నారు.