
- పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో ఇది రిఫ్లెక్ట్ కావాలి
- కేఆర్ఎంబీకి ప్రాజెక్టులఅప్పగింతపై ప్రశ్నించండి
- విభజన అంశాలనూప్రస్తావించండి
- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సూచన
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అంటేనే బీఆర్ఎస్అని.. పార్లమెంట్బడ్జెట్సమావేశాల్లో ఇది రిఫ్లెక్ట్అయ్యేలా పనిచేయాలని తమ పార్టీ ఎంపీలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్కేసీఆర్దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో బీఆర్ఎస్పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. 3 గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
కాంగ్రెస్నుంచి ఉభయ సభల్లో తెలంగాణ సభ్యులే లేరు.. గతంలో ముగ్గురు ఉన్నా.. వాళ్లు రాష్ట్ర ప్రయోజనాలపై గళమెత్తింది లేదు.. బీజేపీ ఎంపీలు నలుగురున్నా వారి పార్టీ హైకమాండ్చెప్పినట్టే మాట్లాడుతరు.. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఎప్పటికైనా బీఆర్ఎస్ఒకటేఅనేది ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలే..” అని కేసీఆర్సూచించారు. ‘‘శ్రీశైలం, నాగార్జున సాగర్ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్రం ఒత్తిడి చేసినా బీఆర్ఎస్ప్రభుత్వం తలొగ్గలేదు..
కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన వెంటనే ఒప్పుకుంది.. దీంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతది.. ఈ విషయాన్ని ఉభయ సభల్లో గట్టిగా వివరించాలి..” అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల ఆపరేషన్ప్రొటోకాల్, కృష్ణా జలాల్లో నీటి పంపకాలు తేలకుండా ప్రాజెక్టులను బోర్డుకు ఎలా అప్పగిస్తారనే దానిపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఉభయ సభల్లో దీనిపై నిరసన తెలపాలన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావించి వాటిని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు.
కాంగ్రెస్ సర్కారు తప్పించుకోవాలని చూస్తున్నది
అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేక కాంగ్రెస్అలవికాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు వాటి అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నదని కేసీఆర్ ఆరోపించారు. దీనిని ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. తాను కోలుకున్న తర్వాత ప్రజల్లోకి వస్తానని చెప్పారు. బడ్జెట్సెషన్తర్వాత ఎంపీలు కార్యక్షేత్రంలోకి దిగాలన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని క్షేత్ర స్థాయి నుంచి ఫీడ్బ్యాక్వస్తున్నదని, దీనిని సమర్థంగా ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షం అనేది స్పష్టంగా తెలియజెప్పాలని కేసీఆర్సూచించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు పాల్గొన్నారు.