
- నియంతృత్వ పాలన ఉండాలనుకున్నడు
- ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి
- టీజేఎస్ ఆఫీసులో రిపబ్లిక్డే వేడుకలు
హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు : భారత రాజ్యాంగాన్నే కేసీఆర్ మార్చాలన్నాడని, చైనా, సింగపూర్ దేశాల్లో లాగా నియంతృత్వ పాలన ఉండాలని ప్రయత్నాలు చేశారని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘‘భారత రాజ్యాంగం పనికిరాదని కొందరు అనుకుంటున్నారు. కొత్త రాజ్యాంగం రాసుకోవాలని చూస్తున్నరు. కానీ మనం ఏ విలువల కోసం పోరాటం చేశామో అవి రాజ్యాంగంలో పొందుపరిచారు. బ్రిటీష్ పాలకులను ఎదిరించిన ప్రతీక రాజ్యాంగం” అని ఆయన గుర్తు చేశారు. శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో కోదండరాం జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనం తరం రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆచరణలోకి వచ్చినపుడే పూర్తి సమానత్వం వచ్చినట్లు అవుతుందని చనిపోయే ముందు గద్దర్ అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం అంతా రాజ్యాంగ విలువల ప్రకారం, శాంతియుతంగా జరిగిందని చెప్పారు.
ఉద్యమంలో చేసినట్లే పనిచేస్తం
ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, మాట నిలబెట్టుకున్నదని కోదండరాం తెలిపారు. పొత్తులో భాగంగా తాను చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశామని, సీట్లు ఇవ్వకున్నా అంగీకరించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పని చేశామో రానున్న రోజుల్లో అదే విధంగా పని చేస్తామని, పదవులు లేనప్పుడు ఒకలా, వచ్చినప్పుడు మరోలా ఉండబోమన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున తానేమి మాట్లాడనన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
రాజ్యాంగాన్ని పరిరక్షించి దాని అమలు కోసం ప్రయత్నం చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని కోదండరాం అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ టీజేఎస్ కన్వీనర్ గుండెళ్లి రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో అరుంధతి నగర్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కోదండరాం హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. జాతీయస్థాయిలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
చుక్కా రామయ్యకు పరామర్శ
ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను కోదండరాం పరామర్శించారు. నల్లకుంట పద్మాకాలనీలోని ఆయన ఇంటి కెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకు న్నారు. గవర్నర్ కోటాలో తాను ఎమ్మెల్సీ అయి నట్లు రామయ్యకు కోదండరాం తెలిపారు. ఎమ్మెల్సీ గా ఉన్నప్పటి అనుభవాలను కోదండరాంతో రామయ్య పంచుకున్నా రు. ప్రజల సమస్యల ను మండలిలో ప్రస్తావించి పరిష్కరించేం దుకు కృషి చేయాలని సూచించారు.