కేసీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌పై దాడి చేస్తే వందల కోట్లు బయటపడ్తయ్ : మధు యాష్కీ

కేసీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌పై దాడి చేస్తే వందల కోట్లు బయటపడ్తయ్ : మధు యాష్కీ
  •  ఏ గోడ కూల్చినా వజ్ర వైడూర్యాలు, నోట్ల కట్టలే 
  • కల్వకుంట్ల అవినీతిలో బీజేపీకి భాగముందని ఆరోపణ

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ అంటేనే అవినీతిమయమని, అక్కడ కుట్రలే జరుగుతాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌పై దాడి చేస్తే కొన్ని వందల కోట్లు బయట పడతాయని చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ ఫండ్ రూ.855 కోట్లకు పెరిగిందన్నారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ తన ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌లో పడుకునేది నోట్ల కట్టలపైనే. అక్కడ ఏ గోడను పగలగొట్టినా.. వజ్ర వైడూర్యాలు, నోట్ల కట్టలు బయటపడతాయి. 60 ఎకరాల్లో ఉన్న ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌కు చుట్టూ అతిపెద్ద గోడ కట్టి ఇంకా విస్తరించాడు.

ఇక్కడ వందల కోట్లు విలువ చేసే స్ఫటిక శిలలతో మూడెకరాలకు పైగా విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. ఈ సరసు కారణంగా చుట్టుపక్కల బావులు ఎండి, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని ఆరోపించారు. బంజారా హిల్స్ లోని 2800 గజాల్లో కవిత నయా నిజాం మాదిరి భవంతిని కట్టుకున్నారన్నారు. కవిత వద్దే ఇన్ని కోట్లు ఉంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు దగ్గర ఇంకెన్ని వందల కోట్లు ఉంటాయో ఆలోచించాలన్నారు. గత పదేండ్ల కాలంలో కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న డబ్బులో బీజేపీకి భాగం ఉందన్నారు. దోచుకున్న సొమ్ములోంచి మోదీకి కప్పం కట్టారని ఆరోపించారు.

అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌‌‌‌‌‌ కేసులో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టయి జైలులో ఉంటే.. కవిత పాత్ర బయటపడ్డా అరెస్ట్ కాలేదన్నారు. ఇటీవల సమ్మక్క- సారలమ్మలను దర్శించుకునే నెపంతో వరంగల్ వెళ్లిన కవిత.. కాంగ్రెస్ నేతలతో మంతనాలు చేశారని ఆరోపించారు. డబ్బులను కూడా ఆఫర్ చేశారన్నారు. లోక్ సభ ఎన్నికలకు పోటీ చేయనని, ప్రచార కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసమే పనిచేస్తానని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారనన్నారు. ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో అహంకారపు వ్యాఖ్యలు చేశారన్నారని మండిపడ్డారు. ‘తమ్మీ కేటీఆర్ మీ రోజులు దగ్గరపడ్డాయి. మీ అవినీతిని త్వరలో బయటకు తీస్తాం” అని హెచ్చరించారు.