కేంద్ర పథకాలను సొంత స్కీములని చెప్పుకుంటుండు : పొంగులేటి సుధాకర్ రెడ్డి

కేంద్ర పథకాలను సొంత స్కీములని చెప్పుకుంటుండు :  పొంగులేటి సుధాకర్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ పథకాలను సీఎం కేసీఆర్ సొంత స్కీములుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్న పొంగులేటి సుధాకర్.. తెలంగాణ, తమిళనాడులోని స్థానిక ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నాయని మండిపడ్దారు. ఎంప్లాయిమెంట్ స్కీమ్ కింద కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టకపోవడంతో మల్కాజ్ గిరి, నల్గొండ ప్రాంతాలకు చెందిన దాదాపు రూ. 12 కోట్లు నిధులు వెనక్కి పోయాయన్నారు.

విద్యా, వైద్యం ఇతర రంగాల్లో అభివృద్ధి కోసం కేంద్రం ఎన్ని కోట్లు విడుదల చేసినా... కేసీఆర్ ప్రభుత్వం మోడీ సర్కారుపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని పొంగులేటి విమర్శించారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై అక్రమ కేసులు పెట్టి  జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు.