సీఎం కేసీఆర్తో కేరళ ముఖ్యమంత్రి భేటీ

సీఎం కేసీఆర్తో కేరళ ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్తో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ మంత్రులు ప్రగతి భవన్లో కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరైన కేరళ సీఎం పినరయిని ముఖ్యమంత్రి కేసీఆర్ లంచ్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జరిగే సీపీఎం సమావేశాలకు కేరళ సీఎం విజయన్ తో పాటు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ సహా మరికొందరు నేతలు హాజరయ్యారు.