పెట్రోల్ బంకుల్లో టాయిలెట్స్ జనం కోసం కాదు.. ఎవరుపడితే వాళ్లు వెళ్లటానికి వీల్లేదు

పెట్రోల్ బంకుల్లో టాయిలెట్స్ జనం కోసం కాదు.. ఎవరుపడితే వాళ్లు వెళ్లటానికి వీల్లేదు

పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ వినియోగంపై ఉన్న వివాదంలో తీర్పు వెలువరించింది కేరళ కోర్టు. పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ ను పబ్లిక్ టాయిలెట్స్ గా పరిగణించలేమని తేల్చి చెప్పింది. అవి కస్టమర్స్ కోసమే తప్ప జనరల్ పబ్లిక్ వినియోగం కోసం కాదని గురువారం (జూన్ 19)   జస్టిస్ సీఎస్.దియాస్ తీర్పు వెలువరించారు.

పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ వినియోగంపై వేర్వేరు పిటిషన్లు నమోదయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా వాటిని పబ్లిక్ టాయిలెట్స్ గా పరిగణించాలని వస్తున్న డిమాండ్ పై  వేర్వేరు పిటిషన్లు నమోదయ్యాయి.  బంక్ లలో ఉన్న టాయిలెట్స్ కస్టమర్స్ కోసమే తప్ప పబ్లిక్ టాయిలెట్స్ గా పరిగణించకూడదని పెట్రోల్ బంక్ ఓనర్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లను అన్నింటినీ ఒకేసారి విచారించిన కోర్టు.. పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లలో ఉన్న టాయిలెట్స్ ను పబ్లిక్ టాయిలెట్స్ గా పరిగణించలేమని పేర్కొంది. 

వివాదం ఏమిటి..?

కేరళలో పెట్రోల్ బంక్ లలో ఉన్న టాయిలెట్స్ ను సాధారణ ప్రజలు కూడా వాడుకునేలా చేయాలని కొందరు వ్యక్తులు, సంస్థలు గత కొంత కాలంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పబ్లిక్ టాయిలెట్స్ గా వాడుకోవచ్చునని సూచించడంతో వివాదం నెలకొంది. కస్టమర్స్ తప్ప సాధారణ ప్రజలను అనుమతించలేమని పెట్రోల్ బంక్ ఓనర్స్ వాదిస్తూ వచ్చారు.

►ALSO READ | నాదేం లేదు.. అంతా వాళ్లిద్దరే చూసుకున్నరు

బంకులలో ఉన్న టాయిలెట్స్ కస్టమర్స్ కోసం కట్టినవని.. అవి పబ్లిక్ టాయిలెట్స్ కాదని కోర్టుకు చెప్పారు. టూరిస్టు బస్సులు, యాత్రలకు వెళ్లిన వారంతా టాయిలెట్స్ ను అనుమతించాలని డిమాండ్ చేస్తు్న్నారని.. కానీ.. అవి తమ కస్టమర్స్ కోసమేనని కోర్టుకు తెలిపారు. 

పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు.. టూరిస్టులు, వందల సంఖ్యలో వచ్చిన యాత్రికులు వాడుకోవడానికి అవి పబ్లిక్  టాయిలెట్స్ కావని తేల్చి చెప్పింది. అదే సమయంలో ఎమర్జెన్సీ కోసం వినియోంచుకోవచ్చునని తెలిపింది. పెట్రోల్ బంకులు సున్నితమైన ప్రదేశాలని, ఆయిల్ నిల్వతో పేలుడు సంభవించే అవకాశం ఉంటుందని.. అలాంటి ప్రదేశంలోకి భారీ మొత్తంలో జనాలను అనుమతించడం కుదరదని సూచించింది.