పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది: కిషన్ రెడ్డి

పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది: కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. పంచాయతీలకు కేటాయించిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కీ ద్వారా గంటలోనే పక్కదారి మళ్లించిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. రోడ్ల మరమ్మతులు చేసేందుకు నిధులు లేకపోవడంతో భూములు అమ్మేందుకు సిద్ధమైతున్నారని మండిపడ్డారు. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ విషయంపై నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్థ ఆర్ధిక విధానాల కారణంగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు యధేచ్ఛగా వనరుల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తు్నారని మండిపడ్డారు. 

ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని కేంద్ర  మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లీటర్ పెట్రోల్ కు అదనంగా రూ.13 రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు. పెట్రోల్ ధరలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం సరికాదన్నారు. డీజిల్ పై 22 శాతం వ్యాట్ ఉంటే తెలంగాణలో 27కు పెంచారని ఆరోపించారు.  ఆయిల్ కంపెనీలు నష్టాలు వచ్చినా ధరలు పెంచలేదున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పెట్రో ఉత్పత్తులు పెరిగినా సామాన్యులపై భారం వేయకుండా ప్రధాని మోడీ పటిష్ట చర్యలు తీసుకున్నారని చెప్పారు.