- కేసీఆర్, రాహుల్మధ్య ఒప్పందం కుదిరింది: కిషన్ రెడ్డి
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: ఫోన్ట్యాపింగ్కేసులో సిట్ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వడం తప్ప, ఎవరిపై చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్సీఎం కాకముందు బీఆర్ఎస్పార్టీ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.
తాను సీఎం అయితే వాళ్లు జైలులో ఉంటారని చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చి రేండేళ్లు దాటినా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. కేసీఆర్, రాహుల్మధ్య ఒప్పందాలు కుదిరాయి. అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు” అని కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘మేం కొట్టినట్టు చేస్తం.. మీరు ఏడ్చినట్టు చేయండి’ అన్నట్టుగా ఈ రెండు పార్టీల వ్యవహారం ఉందని విమర్శించారు. ఫోన్ట్యాపింగ్కేసులో నిందితుడైన డీఎస్పీని సీఐగా డిమోషన్చేశారని, ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్య ఇదేనని ఎద్దేవా చేశారు.
బీజేపీ అంటే కాంగ్రెస్కు భయం: రాంచందర్ రావు
బీజేపీ అంటే కాంగ్రెస్పార్టీకి భయమని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. ‘‘భైంసాలో మత ప్రచారం చేస్తున్నారని మాపై ఆరోపణలు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ర్టంలో మత రాజకీయాలు చేస్తున్నారు. ‘కాంగ్రెస్అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్’ అని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్కు అహంకారం పెరిగింది. ఈ అహంకారం వల్లనే బీఆర్ఎస్ను ప్రజలు ఫాంహౌస్కు పరిమితం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుతోంది. అన్ని మున్సిపాలిటీల్లో సత్తా చాటుతుంది” అని అన్నారు. కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతున్నదని ఎంపీ డీకే అరుణ అన్నారు.
