
హైదరాబాద్: బీజేపీ స్టేట్ చీఫ్గా కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం 11.45 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించను న్నారు. ఉదయం 7.30 గంటలకు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత జగ్జీవన్ రాం, జ్యోతి బాపూలే విగ్రహాలకు నివాళులర్పిస్తారు.
ఆ తర్వాత బషీర్బాగ్లోని కనకదుర్గమ్మ గుడిలో పూజలు చేసి, అక్కడి నుంచి ట్యాంక్బండ్కు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివా ళులర్పిస్తారు. అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి ఉదయం 11. 30 గంటలకు ర్యాలీగా బయలుదేరి బీజేపీ స్టేట్ ఆఫీసుకు చేరుకుంటారు.