క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రం క‌ఠిన చ‌ర్య‌లు

క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రం క‌ఠిన చ‌ర్య‌లు

కరోనా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంద‌ని తెలిపారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. అన్ని రాష్ట్రాలకు కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. స్వీయ నియంత్రణ వల్లనే కరోనా కట్టడి సాధ్యమ‌ని, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కరోనా నియంత్రణలో ఉందన్నారు. రాహుల్ గాంధీ WHOలో పనిచేస్తే బాగుంటదని… ఎలాగూ కాంగ్రెసు అధ్యక్షడికి రాజీనామా చేశాడ‌న్నారు. రాహుల్ మాటలు అర్ధ‌ము లేనివని…కరోనా కట్టడి అన్ని దేశాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వసతి, తిండి, బట్ట లేని వాళ్లకోసము కేంద్రం ఫండ్ రిలీజ్ చేసిందన్నారు.

వ్యవసాయానికి కేంద్రం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పటు చేసిందని…ఏలాంటి సమస్యలు ఉంటే ఆ నెంబర్ కి కాల్ చేయవచ్చన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని…అన్ని రాష్ట్రాలు రైతుల సంబంధించిన అన్ని వాహనాలు అనుమతి ఇవ్వాలన్నారు. మార్కజ్ తర్వాతనే కేసులు ఎక్కువగా అయ్యాయ‌ని.. ఇప్పటికీ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఇది అందరి సమస్య అని, ఎలాంటి మత విభేదాలు లేవన్నారు.

ఏప్రిల్ ఇరవై నుంచి ఈ కామర్స్ అందుబాటులోకి రానున్నాయని, ఢిల్లీ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ సోకిందన్నారు. ఆయన డెలివరీ చేసిన 72 కుటుంబాలను స్వీయ నియంత్రణలోకి పంపామన్నారు. డెలివరీ బోయ్స్ కి ఆన్లైన్ అమ్మకదారులు కొన్ని నిబంధనలు చెప్పామని చెప్పారు. డెలివరీ చేసే సమయంలో దూరం నుంచి ఇవ్వాలని..ఇచ్చే వస్తువును సానిటీజషన్ చేయాలని చెప్పారు. మే మూడు తర్వాత కరోనా తగ్గే అవకాశం ఉందని తెలిపారు కేంద్ర‌ మంత్రి కిషన్ రెడ్డి.