సికింద్రాబాద్ లో మోడీ సభ తర్వాత పెను మార్పులు: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ లో మోడీ సభ తర్వాత పెను మార్పులు: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండేది ఇంకా ఆరు నెలలేనన్నారు. అధికారంలో ఎవరున్నా అభివృద్ధిని ఆపొద్దని సూచించారు. ఏప్రిల్ 8 సికాంద్రాబాద్ లో మోడీ సభతో పెను మార్పులుంటాయన్నారు కిషన్ రెడ్డి.

ఏప్రిల్ 8న  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. రూ.1400 కోట్లతో జరిగిన డబ్లింగ్ పనులను మోడీ ప్రారంభిస్తారని చెప్పారు. రూ.7764 కోట్లతో చేపట్టే నూతన  జాతీయ రహాదారులకు ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారని తెలిపారు.  అలాగే రూ. 1366 కోట్లతో  బీబీనగర్ ఎయిమ్స్ నూతన భవనానికి  శంకుస్థాపన చేస్తామన్నారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. అనేక అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.

ఎంఎంటీఎస్ ఫేజ్ 2పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు కిషన్ రెడ్డి.  ఎంఎంటీఎస్  ఫేజ్2 పై నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నా స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడి లేకపోడం వల్లే ఎంఎంటీఎస్ ఆలస్యం జరిగిందన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్2 జేఐ కోసం  13 ట్రైన్ లు ప్రారంభిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. ఏప్రిల్ 8న ప్రారంభించనున్న రెండో వందేభారత్ ట్రైన్ వల్ల  హైదరాబాద్ టూ తిరుపతి ప్రయాణం మరింత ఈజీ కానుందన్నారు. 

https://www.youtube.com/watch?v=oarprSEoECA